మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతోన్న భారత్, శ్రీలంక రెండో వన్డేలో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో లంకను ఓడించిన టీమిండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న భారత్ రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని చూస్తుంది.
మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ సెంచరీ, ఓపెనర్లు రోహిత్, శుభ్ మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో 373/7 భారీ స్కోరు చేసింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లు 306/8 కి పరిమితం చేశారు. ఈ మ్యాచ్ లో లంక కెప్టెన్ దసున్ షనక సెంచరీ సాధించాడు.
తుది జట్లు:
శ్రీలంక : కుసాల్ మెండిస్(w), అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువానీదు ఫెర్నాండో, దసున్ షనక(c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత
భారత్: రోహిత్ శర్మ(సి), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్