గ్లోబల్‌‌‌‌ లీడర్‌‌‌‌ దారిలో ఇండియా

గ్లోబల్‌‌‌‌ లీడర్‌‌‌‌ దారిలో ఇండియా

2014 నుంచి  దేశ ప్రతిష్ట పెరిగింది.. దేశప్రజలకు ప్రధాని మోడీ లెటర్

ప్రజల అభిమానాలతో సెకండ్ టర్మ్​ ఏడాది పాలన పూర్తి

ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాం..

ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ ఇంకా ఎన్నో నిర్ణయాలు

కరోనాతో యుద్ధంలో గెలుపు దారిలో వెళ్తున్నం

ఫ్యూచర్ మనమే డిసైడ్ చేస్తం

వలస కార్మికుల బాధలను దేశం గుర్తించింది

‘గుర్తుంచుకోండి.. 130 కోట్ల మంది ప్రజల వర్తమానాన్ని, భవిష్యత్తును ఓ ‘విపత్తు’ శాసించలేదు. మన వర్తమానాన్నే కాదు.. ఫ్యూచర్​ను కూడా మనమే డిసైడ్ చేస్తం. మనం ఇప్పుడు గెలుపు దారిలో ఉన్నాం. గెలుపు మాత్రమే మనందరి సంకల్పం కావాలి. కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తన యూనిటీతో, గట్టి సంకల్పంతో ప్రపంచాన్ని ఇండియా ఆశ్చర్యపరిచింది.’

న్యూఢిల్లీ: ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని, గతేడాది ఇదే రోజు (శనివారం) దేశం డెమోక్రసీలో సువర్ణ​అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలుగానే ఉండిపోయిన చాలా అంశాలను పరిష్కరించామని చెప్పారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని, సీఏఏను తీసుకొచ్చామని తెలిపారు. దేశాన్ని ‘గ్లోబల్‌‌ లీడర్‌‌‌‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా ‘2.0’ సాగిందని చెప్పారు. బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్‌‌ లెటర్‌‌‌‌ రాశారు. “మామూలుగా అయితే మీ మధ్యలో ఉండేవాడ్ని. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ లెటర్‌‌‌‌ ద్వారా మీ ఆశీస్సులు కోరుతున్నా. మీ ఆప్యాయత, సహకారం కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయి” అని పేర్కొన్నారు. కరోనాతో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో  దేశం గెలుపుదారిలో వెళ్లడం ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. వలస కార్మికుల బాధలను దేశం గుర్తించిందని చెప్పారు. లెటర్ విడుదల చేసిన తర్వాత.. ట్విట్టర్​లో మోడీ ఆడియో మెసేజ్ పెట్టారు. లెటర్​లోని అంశాలను చదివి వినిపించారు.

ఆర్టికల్ 370.. అయోధ్య.. ట్రిపుల్ తలాక్…

దేశంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలుగానే ఉండిపోయిన చాలా అంశాలను పరిష్కరించామని మోడీ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌లో ఆర్టికల్‌‌ 370 రద్దు చేశామని, ఇది ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటిందని అన్నారు. అయోధ్య రామమందిరం వివాదం తన పాలనాకాలంలోనే సద్దుమణగడం సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. ముస్లిం మహిళల గౌరవం కాపాడేందుకు ‘ట్రిపుల్ తలాక్’ సంప్రదాయాన్ని రద్దు చేశామన్నారు. సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్.. మన దేశ దయాగుణాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందని అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) నియామకం.. ఆర్మీ, ఎయిర్​ఫోర్స్, నేవీ మధ్య కో ఆర్డినేషన్ పెంచిందని చెప్పారు.

లెటర్​లో ఇంకా ఏమున్నాయంటే..

పేదలు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాలకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

పెట్టుబడి సాయం అందించేందుకు ‘పీఎం కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి’ని రైతులందరికి వర్తింపజేశాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.72,000 కోట్లను రైతుల అకౌంట్లలో వేశాం.

జల్‌‌జీవన్‌‌ మిషన్‌‌ ద్వారా 15 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందిస్తాం.

చిన్నవ్యాపారులు, వ్యవసాయ కూలీల్లో 60 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తాం.

ఫిషర్‌‌‌‌మెన్‌‌ కోసం సపరేట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఏర్పాటు చేశాం. బ్లూ ఎకానమీని బూస్టప్‌‌ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.

వ్యాపారుల సమస్యలను తీర్చేందుకు ‘వ్యాపారి కల్యాణ్‌‌ బోర్డు’ ఏర్పాటు.

గిరిజన ప్రాంతాల్లోని పిల్లల కోసం 400 ‘ఏకలవ్య మోడల్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు’ ప్రారంభించాం.

మహిళలకు రుణ సదుపాయం కల్పించాం.

ప్రపంచమే మనవైపు చూస్తోంది

మన దేశాన్ని కరోనా ముంచెత్తిందని మోడీ అన్నారు. ‘‘వైరస్ మన దేశంలోకి వచ్చినప్పుడు.. ఇండియా ప్రపంచానికే సమస్యగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు మనం తీసుకున్న చర్యల వల్ల ప్రపంచమే మనవైపు చూస్తోంది. ప్రపంచంలోని శక్తిమంతమైన, ధనిక దేశాలతో పోలిస్తే మన దేశ ప్రజల బలం, సామర్థ్యం అసమానమైనవని మీరు నిరూపించారు” అని పొగిడారు. కరోనా వారియర్స్‌‌ కోసం చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, జనతా కర్ఫ్యూ, లాక్‌‌డౌన్‌‌ రూల్స్ పాటించడం ద్వారా ‘ఏక్‌‌ భారత్‌‌-శ్రేష్ట భారత్‌‌’ అని నిరూపించారన్నారు.

వలస కూలీలకు ఇబ్బందులు

కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారని మోడీ బాధపడ్డారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని, వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు ఎన్నో ఇక్కట్లు పడ్డారని చెప్పారు. ‘‘వ్యాపారులు, కూలీలు, మైగ్రెంట్ వర్కర్లు, హాకర్లు, హస్తకళాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ బాధలు, అసౌకర్యాలు, విపత్తులుగా మారకుండా చూసుకుందాం. అంపన్‌‌ తుపాను బెంగాల్‌‌, ఒడిశాలను నాశనం చేసింది. కానీ అక్కడి ప్రజలు ధైర్యంతో ఉన్నారు. వారి ధైర్యం దేశ ప్రజలందరికీ స్ఫూర్తి నిచ్చింది” అని ప్రధాని కొనియాడారు.

చారిత్రక తప్పిదాలను సరిదిద్దినం: అమిత్‌‌ షా

ఆరేళ్లలో ఎన్నో చారిత్రక తప్పిదాలను సరిదిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. ‘ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా పాపులర్ ప్రధానికి కంగ్రాట్స్. మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతున్నా’ అని షా ట్వీట్​చేశారు.  బీజేపీ కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పారు. మోడీ నాయకత్వంపై నమ్మకంతో రెండో సారి ఎన్నుకున్న దేశ ప్రజలకు సెల్యూట్​చేస్తున్నానన్నారు. కరోనా సంక్షోభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని కాపాడడంలో మోడీ ముందున్నారని బీజేపీ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా చెప్పారు.

‘వికాస్ యాత్ర’ను షేర్ చేసిన మోడీ

తన సెకండ్ టర్మ్​ పాలనకు సంబంధించి ప్రధాని మోడీ ‘వికాస్ యాత్ర’ పేరుతో ఓ డాక్యుమెంట్​ను శనివారం ట్విట్టర్​లో షేర్ చేశారు. ఈ డాక్యుమెంట్​ను 15 విభాగాలుగా చేశారు. ‘‘అభివృద్ధి, ఎంపవర్​మెంట్, సర్వీసుల్లో మన దేశం ఎలా ముందుకు వెళ్తోందో తెలుసుకునేందుకు వికాస్ యాత్రపై ఓ లుక్కేయండి” అంటూ పీఎం ట్వీట్ చేశారు.

For More News..

రేపటి నుంచి స్పెషల్ ట్రైన్లు