బ్రిస్టల్ : ఇంగ్లండ్ విమెన్స్ టీమ్తో జరిగిన మూడో టీ20లో ఇండియా బౌలర్లు పోరాడినా ఫలితం దక్కలేదు. లో స్కోరును కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో గురువారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 122/8 స్కోరు చేసింది. రిచా ఘోష్ (33), దీప్తి శర్మ (24) ఫర్వాలేదనిపించారు.
ఇంగ్లిష్ బౌలర్లు సోఫీ ఎకెల్స్టోన్ (3/25), సారా గ్లెన్ (2/11) ధాటికి ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలింది. షెఫాలీ (5), స్మృతి మంధాన (9), సబ్బినేని మేఘన (0), హర్మన్ప్రీత్ (5), హేమలత (0) సింగిల్ డిజిట్కే ఔట్ కావడంతో ఇండియా 35 రన్స్కే సగం టీమ్ పెవిలియన్కు చేరింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 126/3 స్కోరు చేసి గెలిచింది. సోఫియా డంక్లే (49), అలీస్ కాప్సే (38 నాటౌట్), డ్యానీ వ్యాట్ (22) రాణించారు. ఎకెల్స్టోన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.