India women Tri series : ట్రై సిరీస్లో బోణీ కొట్టిన భారత్

India women Tri series : ట్రై సిరీస్లో బోణీ కొట్టిన భారత్

సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్2023 కసరత్తులో భాగంగా విమెన్ టీమిండియా.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడుతోంది. గురువారం (జనవరి 19) ప్రారంభమైన ఈ సిరీస్ లో భారత్ కు శుభారంభం లభించింది. మొదటి మ్యాచ్ లో సఫారీలతో తలపడిన భారత జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టుపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 147 పరుగులు చేసింది. అమర్జోత్ కౌర్ (41 నాటౌట్), యస్తికా భాటియా (35), దీప్తి శర్మ (33) చెలరేగి ఆడటంతో మంచి స్కోర్ సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అమర్ జోత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.

ట్రై సిరీస్ షెడ్యూల్:

  • జనవరి 19: భారత్W vs  సౌతాఫ్రికాW, 10:30 PM IST.
  • జనవరి 21:  సౌతాఫ్రికాW  vs వెస్టిండీస్W, 6:30 PM IST.
  • జనవరి 23: భారత్W vs వెస్టిండీస్W, 10:30 PM IST.
  • జనవరి 25: సౌతాఫ్రికాW  vs వెస్టిండీస్W, 6:30 PM IST.
  • జనవరి 28: సౌతాఫ్రికాW  vs. భారత్W, 10:30 PM IST.
  • జనవరి 30: వెస్టిండీస్W vs భారత్W, 6:30 PM IST.
  • ఫిబ్రవరి 2: TBC vs TBC, ఫైనల్, 6:30 PM IST.