పోరాడినా మూడో టీ20లో ఇండియా విమెన్స్​ టీమ్​కు ఓటమి తప్పలె

పోరాడినా మూడో టీ20లో ఇండియా విమెన్స్​ టీమ్​కు ఓటమి తప్పలె

ముంబై: టార్గెట్​ ఛేజింగ్​లో షెఫాలీ వర్మ (52) పోరాడినా.. మూడో టీ20లో ఇండియా విమెన్స్​ టీమ్​కు ఓటమి తప్పలేదు. ఎలీసా పెర్రీ (75), గ్రేసి హారిస్​ (41) రాణించడంతో.. బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా 21 రన్స్​ తేడాతో ఇండియాపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్​ల సిరీస్​లో కంగారూలు 2–1 ఆధిక్యంలో నిలిచారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది. 

బెత్​ మూనీ (30) రాణించింది. ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్​, అంజలి, దీప్తి, దేవికా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 151/7 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ (37), దీప్తి శర్మ (25 నాటౌట్​) పోరాడి విఫలమయ్యారు. పెర్రీకి ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’ అవార్డు లభించింది. ​