
ముంబై: టార్గెట్ ఛేజింగ్లో షెఫాలీ వర్మ (52) పోరాడినా.. మూడో టీ20లో ఇండియా విమెన్స్ టీమ్కు ఓటమి తప్పలేదు. ఎలీసా పెర్రీ (75), గ్రేసి హారిస్ (41) రాణించడంతో.. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 21 రన్స్ తేడాతో ఇండియాపై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో కంగారూలు 2–1 ఆధిక్యంలో నిలిచారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది.
బెత్ మూనీ (30) రాణించింది. ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్, అంజలి, దీప్తి, దేవికా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 151/7 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (37), దీప్తి శర్మ (25 నాటౌట్) పోరాడి విఫలమయ్యారు. పెర్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.