ప్రాక్టీస్‌‌‌‌లో పల్టీ

ప్రాక్టీస్‌‌‌‌లో పల్టీ

కేప్​ టౌన్:  టీ20 వరల్డ్​కప్‌‌‌‌పై కన్నేసిన ఇండియా విమెన్స్​ టీమ్​కు ​ వామప్​ మ్యాచ్​లో చుక్కెదురైంది. బ్యాటింగ్​లో ఒక్కరు కూడా రాణించకపోవడంతో.. సోమవారం జరిగిన తొలి ప్రాక్టీస్​ మ్యాచ్​లో 44 రన్స్​ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​ 20 ఓవర్లలో 129/8 స్కోరు చేసింది. జార్జియా వారెహమ్​ (32), బెత్​ మూనీ (28), గార్డ్​నర్​ (22), జొనాసెన్​ (22) రాణించారు. ఇండియా బౌలర్లలో శిఖా పాండే, పూజా, రాధా యాదవ్​ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా 16 ఓవర్లలో 85 రన్స్​కే కుప్పకూలింది. దీప్తి శర్మ (19 నాటౌట్​) టాప్​ స్కోరర్​. ఇన్నింగ్స్​ మొత్తంలో 8 మంది సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. డార్సి బ్రౌన్​ 4, గార్డ్‌‌‌‌నర్​ 2 వికెట్లు తీశారు.