కేప్ టౌన్: టీ20 వరల్డ్కప్పై కన్నేసిన ఇండియా విమెన్స్ టీమ్కు వామప్ మ్యాచ్లో చుక్కెదురైంది. బ్యాటింగ్లో ఒక్కరు కూడా రాణించకపోవడంతో.. సోమవారం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో 44 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 129/8 స్కోరు చేసింది. జార్జియా వారెహమ్ (32), బెత్ మూనీ (28), గార్డ్నర్ (22), జొనాసెన్ (22) రాణించారు. ఇండియా బౌలర్లలో శిఖా పాండే, పూజా, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా 16 ఓవర్లలో 85 రన్స్కే కుప్పకూలింది. దీప్తి శర్మ (19 నాటౌట్) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ మొత్తంలో 8 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. డార్సి బ్రౌన్ 4, గార్డ్నర్ 2 వికెట్లు తీశారు.