
నాగ్పూర్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలానికి కంగారులు తడబడ్డారు. మూడోరోజు ఆటకు వచ్చిన ఆసీస్ 91 పరుగులకే (33ఓవర్లు) కుప్పకూలింది. దీంతో టీమిండియాకు 132 పరుగుల భారీ తేడాతో పాటు ఇన్నింగ్స్ విజయం లభించింది.
అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు, మహమ్మద్ షమీ 2 వికెట్లు, అక్షర్ కి ఒక వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ టెస్టు క్రికెట్లో 31 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో 25 సార్లు 5 వికెట్లు దక్కాయి.