ఒడిశా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్ సతీష్‌‌‌‌‌‌‌‌

ఒడిశా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్ సతీష్‌‌‌‌‌‌‌‌

కటక్‌‌‌‌‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ సతీష్​ కుమార్‌‌‌‌‌‌‌‌ కరుణాకరన్‌‌‌‌‌‌‌‌.. ఒడిశా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్ గెలిచాడు.  ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ ఫైనల్లో సతీష్​ 21–18, 19–21, 21–14తో తోటి షట్లర్ ఆయూష్‌‌‌‌‌‌‌‌ షెట్టిపై గెలిచాడు. సతీష్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది తొలి బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–100 టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం.

మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల 17–21, 21–19, 23–21తో హీ యంగ్ కాయ్‌‌‌‌‌‌‌‌ టెర్రీ–టాన్‌‌‌‌‌‌‌‌ వీ హన్‌‌‌‌‌‌‌‌ జెస్సికా (సింగపూర్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌–సాయి ప్రతీక్‌‌‌‌‌‌‌‌ 22–20, 18–21, 17–21తో లిన్‌‌‌‌‌‌‌‌ బింగ్‌‌‌‌‌‌‌‌ వీ–సు చింగ్‌‌‌‌‌‌‌‌ హెంగ్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ) చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప14–21, 17–21తో ట్రియాస్‌‌‌‌‌‌‌‌–రాచెల్‌‌‌‌‌‌‌‌ అలీసా (ఇండోనేసియా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు.