ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నమెంట్‌‌‌‌లో .. సత్తా చాటిన షణ్ముఖి, తేజల్, కుశాల్‌‌‌‌ దలాల్‌‌

ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నమెంట్‌‌‌‌లో .. సత్తా చాటిన షణ్ముఖి, తేజల్, కుశాల్‌‌‌‌ దలాల్‌‌

సింగపూర్: ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా యంగ్ ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. తెలుగమ్మాయి షణ్ముఖి నాగ సాయితో పాటు  తేజల్ సాల్వే, కుశాల్ దలాల్‌‌‌‌  ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లి కనీసం మూడు మెడల్స్ ఖాయం చేశారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌ కాంపౌండ్ సెమీ ఫైనల్లో షణ్ముఖి నాగసాయి 145–-139 తేడాతో ఇండోనేసియా ఆర్చర్‌‌‌‌ యురికె నినా బొనిటాను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌‌‌‌లో రెండో సీడ్ తేజల్ సాల్వే 147–-142తో మలేసియా ప్రత్యర్థిపై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

మెన్స్ కాంపౌండ్ సెమీస్‌‌‌‌లో కుశాల్ 147–143తో హిము బయార్ (బంగ్లాదేశ్‌‌‌‌)ను ఓడించి ఫైనల్ చేరాడు. కానీ, మరో సెమీస్‌‌‌‌లో ఓడిన సచిన్ ఛెచి కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాడు. అంతకుముందు షణ్ముఖి, తేజల్, తనిష్క థోకల్‌‌‌‌లతో కూడిన విమెన్స్‌‌‌‌ కాంపౌండ్ జట్టు టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌‌‌‌లో 2101 పాయింట్లు సాధించి కొత్త  వరల్డ్‌‌‌‌ రికార్డును నెలకొల్పింది.  మిక్స్‌‌‌‌డ్ టీమ్ ఈవెంట్‌‌లో కుశాల్, షణ్ముఖి జోడీ 1420 పాయింట్లతో  మరో రికార్డు బద్దలు కొట్టింది.