బాలాసోర్(ఒడిశా): డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. భూమ్మీది నుంచి గాల్లోని లక్ష్యాలను చేధించగలిగే మిసైళ్లను(క్యూఆర్ఎస్ఏఎం) ఇండియన్ ఆర్మీ, డీఆర్డీవో కలిసి గురువారం విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్యూఆర్ఎస్ఏఎం పరీక్షను నిర్వహించినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. ట్రయల్స్లో భాగంగా ఆకాశంలో ఉన్న వస్తువును మిసైల్ కచ్చితత్వంతో పేల్చిందని చెప్పారు.
స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్తో కూడిన మిసైల్, మొబైల్ లాంచర్, పూర్తి ఆటోమేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టిపుల్ ఫంక్షనల్ రాడార్తో పాటు అన్ని సబ్సిస్టమ్స్ను పరీక్షించామన్నారు. ఈ మిసైల్ 30 కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే టార్గెట్లను చేధిస్తుంది. శత్రుదేశాల విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేయడంలో ఉపయోగపడనుంది. త్వరలోనే ఈ మిసైళ్లను ఇండియన్ ఆర్మీకి అందజేయనున్నారు.