పాక్ డ్రోన్ ను పేల్చేసిన ఇండియా ఆర్మి

పాక్ డ్రోన్ ను పేల్చేసిన ఇండియా ఆర్మి

రాజస్థాన్ : మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్‌ చేసిన ప్రయత్నాన్ని BSF దళం తిప్పి కొట్టింది. శనివారం రాజస్థాన్ బార్డర్ వెంట మన దేశంలోకి ప్రవేశించడానికి డ్రోన్‌ గట్టి ప్రయత్నం చేసింది. అయితే డ్రోన్ రాకను పసిగట్టిన BSF దాన్ని కూల్చివేసింది.  ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్‌ సమీపంలోని హిందూమల్‌ కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఇది భారత్‌ లోకి ప్రవేశించిందని BSF అధికారి తెలిపారు. ఆ వెంటనే దళాలు కాల్పులు జరిపి, దాన్ని పేల్చేశాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్‌ డ్రోన్‌ భారత్‌లోకి ప్రవేశించడానికి చేసిన మరో ప్రయత్నం ఇది. పెద్దఎత్తున ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని సరిహద్దు సమీపంలో నివసించే గ్రామస్థులు తెలిపారు.