రాజస్థాన్ : మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్ చేసిన ప్రయత్నాన్ని BSF దళం తిప్పి కొట్టింది. శనివారం రాజస్థాన్ బార్డర్ వెంట మన దేశంలోకి ప్రవేశించడానికి డ్రోన్ గట్టి ప్రయత్నం చేసింది. అయితే డ్రోన్ రాకను పసిగట్టిన BSF దాన్ని కూల్చివేసింది. ఈ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో శ్రీగంగానగర్ సమీపంలోని హిందూమల్ కోట్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా ఇది భారత్ లోకి ప్రవేశించిందని BSF అధికారి తెలిపారు. ఆ వెంటనే దళాలు కాల్పులు జరిపి, దాన్ని పేల్చేశాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ డ్రోన్ భారత్లోకి ప్రవేశించడానికి చేసిన మరో ప్రయత్నం ఇది. పెద్దఎత్తున ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని సరిహద్దు సమీపంలో నివసించే గ్రామస్థులు తెలిపారు.
Indian Army troops shot at a Pakistani drone along the international border in Rajasthan's Sri Ganganagar sector
Read @ANI Story | https://t.co/CqXpbw8lBn pic.twitter.com/9yvPu8Yg4n
— ANI Digital (@ani_digital) March 9, 2019