పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లాండ్

ఫస్ట్ వన్డేలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కేవలం 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ముఖ్యంగా బుల్లెట్ బంతులతో బుమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను వణికించాడు. 6 పరుగుల వద్ద జేసన్ రాయ్, రూట్ ను డకౌట్ చేశాడు.మరో పరుగు తర్వాత ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. 7 పరుగుల వద్ద స్టోక్స్ను కూడా డకౌట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు వికెట్ల పతనాన్ని బట్లర్, బెయిర్ స్టో అడ్డుకున్నారు. కాసేపటికే బెయిర్ స్టోను  షమీ పెవీలియన్ చేర్చాడు.  కాసేపటికే బుమ్రా మరోసారి మాయ చేశాడు. లివింగ్ స్టోన్ ను బోల్తాకొట్టించాడు. దీంతో ఇంగ్లాండ్ 26  పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.