
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ ఓ ఇంటివాడుకాబోతున్నాడు. త్వరలోనే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 8న ఎంగేజ్ మెంట్, నవంబర్ 18న వీళ్ల పెళ్లి జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. లఖ్నవూలోని ఓ లగ్జరీ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుంది.
రింకూ సింగ్, ప్రియ పెళ్లి వార్తలు ఈ ఏడాది జనవరిలోనే వినిపించాయి. ముందు నుంచే వాళ్లిద్దరికి పరిచయం ఉందని గతంలో ప్రియ తండ్రి ఎమ్మెల్యే తుపాని సరోజ్ చెప్పారు. వీళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు..
ALSO READ | వారిపై లేని చర్యలు షర్మిస్తాపై ఎందుకు.. ఇదేనా లౌకికవాదం: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్..
ప్రియా సరోజ్ తల్లి తుఫానీ సరోజ్. ఆమె సమాజ్ వాదీ పార్టీ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో ప్రియా సరోజ్ తన మొదటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బిపి సరోజ్ని 35,850 ఓట్ల తేడాతో ఓడించి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన రెండవ అతి పిన్న వయస్కురాలు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి బిఎ డిగ్రీతప్ పాటు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి LLB పట్టా పొందారు. రింకూ సింగ్ టీమిండియా తరపున 33 టీ20లు ,రెండు వన్డేలు ఆడాడు.