
భారత క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు, రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పంత్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో BMW కారును పంతే స్వయంగా నడుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంత్ తల, పాదాలతో పాటు వీపు బాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు రిషబ్ పంత్కు ప్రమాదం కావడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అతని ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. రూర్కి వద్ద ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టింది.కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ కోసం ఢిల్లీకి తరలించారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.