ఖైరతాబాద్,వెలుగు: ఇండియన్డెయిరీ అసోసియేషన్సౌత్జోన్ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి 6 వరకు మూడు రోజులు 50వ డెయిరీ ఇండస్ట్రీ (ఐడీఏ) తెలంగాణ శాఖ సమావేశం సిటీలోని హైటెక్స్ఎగ్జిబిషన్సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు సౌత్జోన్ చైర్మన్ సతీశ్కులకర్ణి, తెలంగాణ, కరీంనగర్డెయిరీల చైర్మన్సీహెచ్రాజేశ్వరరావు తెలిపారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులు, ప్రొఫెసర్లు, డెయిరీ పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు, ఆధునిక మెషినరీల తయారీ సంస్థల యజమానులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సదస్సును సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. అనంతరం సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐడీఏ ఉపాధ్యక్షుడు కేఆర్ రావు, దొడ్ల డెయిరీ సీఈసీ సభ్యుడు బీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
