ఆకాశమంత ఎత్తుకు భారత్ ఖ్యాతి.. పాకిస్థాన్​కి ఘోర అవమానం

ఆకాశమంత ఎత్తుకు భారత్ ఖ్యాతి.. పాకిస్థాన్​కి ఘోర అవమానం

దేశవ్యాప్తంగా అందరూ 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు సందేశానిచ్చారు. 

ఇదే సమయంలో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చారు. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు దుబాయ్​లోని బుర్జ్​ఖలీఫా బిల్డింగ్​పై ఎల్ ఈడీ లైట్లతో భారత్​ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒక్క సారిగా దేశ భక్తి ఉప్పొంగిన  ఆ క్షణాల్లో జాతీయ గీతాన్ని కూడా బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  

వెనుదిరిగిన పాకిస్థాన్​ ప్రజలు...

ఇండియా కంటే ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్న పాకిస్థాన్​కి  దుబాయిలో ఘోర అవమానం జరిగింది.  స్వాతంత్య్ర వేడుకలను జరుపుకునే దేశాల జెండాలను బుర్జ్​ ఖలీఫాపై ప్రదర్శిస్తుంటారు. 

దీంతో పాకిస్థానీయులు కూడా తమ దేశ జెండాను భవనంపై చూసుకునేందుకు తరలివచ్చారు. అర్ధరాత్రి దాటినా తమ దేశ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ దయాది దేశ ప్రజలు గుమిగూడిన వీడియోలు కూడా వైరల్​గా మారాయి. 

అదే సమయంలో భారత్​ జెండా రెపరెపలాడటం పాక్​కి ఘోర అవమానంగానే చెబుతున్నారు నిపుణులు.