
సింగపూర్: ఆసియా కప్ స్టేజ్–2లో ఇండియా జూనియర్ ఆర్చర్ల గురి అదురుతోంది. మొత్తం ఐదు జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగిన మెన్స్ రిక్వర్ సెమీస్లో విష్ణు చౌదరీ–పారస్ హుడా–జుయెల్ సర్కార్తో కూడిన ఇండియా త్రయం 5–1తో మూడోసీడ్ జపాన్ను చిత్తు చేసింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో వైష్ణవి పవార్–విష్ణు చౌదరీ 5–3తో సింగపూర్కు చెందిన తబితా ఎర్న్ లిన్ యో–యు లాంగ్పై నెగ్గి టైటిల్ ఫైట్కు అర్హత సాధించారు.
కాంపౌండ్ మెన్స్ టీమ్ ఈవెంట్లో కుశాల్ దలాల్–గణేశ్ తిర్ముర్–మిహిర్ అపార్తో కూడిన ఇండియా త్రయం షూటాఫ్లో (30–29) ఆస్ట్రేలియాను ఓడించింది. రెగ్యులర్ మ్యాచ్లో ఇరుజట్లు 232 స్కోరు సాధించడంతో షూటాఫ్ నిర్వహించారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీస్లో షణ్ముకి–కుశాల్ 155–154తో నౌరిసా దియాన్ అష్రిఫా–ప్రిమా విష్ణు వర్ధన్ (ఇండోనేసియా)పై నెగ్గారు. కాంపౌండ్ విమెన్స్ టీమ్ సెమీస్లో షుణ్మకి బుద్దె–తేజల్ సాల్వీ–తనిష్క తోకల్ 230–229తో కజకిస్తాన్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
విమెన్స్ రికర్వ్ టీమ్ క్వార్టర్స్లో వైష్ణవి పవార్–కీర్తి–తమన్నా బృందం 4–5 (26–28)తో జపాన్ చేతిలో కంగుతిన్నారు. విమెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఫైనల్లో షణ్ముకి.. తేజల్ గోల్డ్ మెడల్ కోసం పోటీపడనున్నారు. ఇక మెన్స్ కాంపౌండ్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో కుశాల్.. జోషువా మహోన్ (ఆస్ట్రేలియా)తో, బ్రాంజ్ పోరులో సచిన్ చెచీ.. హిము బచ్చర్ (బంగ్లాదేశ్)తో తలపడనున్నారు.