
వారం క్రితమే భార్య చనిపోయింది..పుట్టెడు దుఖంలో ఉన్నాడు..భార్య తీపి జ్ణాపకాలు ఇంకా చెరిగిపోలేదు..చనిపోతూ భార్య కోరిన కోరికతీర్చాలని ఇండియాకు వచ్చాడు. అనుకున్నది పూర్తి చేశాడు. తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలోనే విషాదం..అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన అర్జున్ మనుభాయ్ పటోలియా ప్రాణాలో కోల్పోయాడు. వారం వ్యవధిలో తల్లి తండ్రి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.
36యేళ్ల అర్జున్ మనుభాయ్ పటోలియా..లండన్ లో స్థిరపడిన ఇండియన్ ఆరిజన్. గురువారం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన 241 మంది ప్రయాణికుల్లో ఒకరు. అతని స్వగ్రామం గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని వాడియా. గుజరాత్ లోని నర్మదానదిలో తన భార్య అస్థికలు కలిపిందు కు వచ్చి తిరుగు ప్రయాణంలో అర్జున్ మనుభాయ్ పటోలియా ప్రాణాలు కోల్పోయారు.
వారం రోజుల క్రితమే పటోలియా భార్య భారతీబెన్ లండన్ లో చనిపోయింది. భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నర్మదానదిలో కలిపేందుకు గుజరాత్ కు వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానం AI171 ఎక్కారు. దురదృష్టవశాత్తు గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 బోయింగ్ డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
►ALSO READ | బెంగుళూర్ తొక్కిసలాట కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేకు బెయిల్
అర్జున్ పటోలియా మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అర్జున్ పటోలియాకు ఇద్దరు కుమార్తెలు. నాలుగు, ఎనిమిదేళ్ల వయస్సున్న చిన్న పిల్లాలు. వారం వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పో్యిన వారి ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.
గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో జరిగిన వినాశకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, 10 మంది ఫ్లైట్ సిబ్బంది, ఇద్దరు పైలట్లతో సహా బీజే కాలేజీ మెడికోలు 24 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఇది ఒకటి.