వరల్డ్ ఛాంపియన్ షిప్లో భారత జోడి జోరు

వరల్డ్ ఛాంపియన్ షిప్లో భారత జోడి జోరు

వరల్డ్ ఛాంపియన్ షిప్లో మెన్స్ డబుల్స్లో భారత జోడి ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల్  రెండో రౌండ్ కు చేరుకుంది. తొలి రౌండ్ లో ఈ జంట డెన్మార్క్ జోడి కిమ్ ఆస్ట్రప్, అండర్స్ రాస్‌ముస్సేన్‌లన్‌పై 21-17, 21-16 తేడాతో గెలిచింది. ఫస్ట్ సెట్ లో డెన్కార్క్ జోడి కాస్త పోరాడినా..రెండో సెట్లో భారత జోడి జోరుకు నిలవలేకపోయింది.


BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2022 నుంచి  అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి నిష్క్రమించారు.  ఉమెన్స్  డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి  చైనా జంట చేతిలో వరుస గేమ్‌లలో ఓడిపోయారు.   చెన్ క్వింగ్ చెన్, జియా యిఫాన్‌ల చేతిలో 15-21, 10-21 తేడాతో పరాజయం చవిచూశారు. మొత్తం 42నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో..  తొలి సెట్లో అశ్విని, సిక్కి 15-17తో వెనుకబడ్డారు.  వరుసగా 4పాయింట్లు కోల్పోయి సెట్ కోల్పోయారు. అయితే రెండో సెట్‌ను ధాటిగా ఆరంభించారు. 9-11 వరకు సెట్ హోరాహోరీగా సాగింది. అయితే తర్వాత కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించగా.. చైనా జోడీ 10 పాయింట్లతో సెట్ ముగించింది. అటు మరో మ్యాచ్లో  పూజా దండు, సంజన సంతోష్‌లు కూడా పరాజయం పాలయ్యారు. పూజా, సంజన వరుస గేమ్‌లలో 15-21, 7-21తో కొరియా జోడి చేతిలో ఓడిపోయారు.