సికింద్రాబాద్, వెలుగు: హోళీ పండుగకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్5 వరకు వివిధ రూట్లలో స్పెషల్ట్రైన్లు నడపనున్నట్లు చెప్పారు.
ఆయా తేదీల్లో సికింద్రాబాద్– -దర్బంగా– -సికింద్రాబాద్, హైదరాబాద్– -పాట్నా– -హైదరాబాద్, ముజఫర్ పూర్–-యశ్వంత్పూర్– ముజఫర్పూర్, సికింద్రాబాద్ – -ముజఫర్ఫూర్– -సికింద్రాబాద్, కోయంబత్తూర్– భగత్కీ కోఠి– -కోయంబత్తూర్, తంబరం-– సంత్రగచ్చి–- తంబరం, కొచ్చువెలి– -ధనాపూర్– -కొచ్చువెలి స్టేషన్ల మధ్య స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
