గంగాధర మండలంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

 గంగాధర మండలంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

గంగాధర, వెలుగు: గంగాధర మండలం నారాయణపూర్​భూ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫొటోలకు కాంగ్రెస్​ లీడర్లు మధురానగర్​ చౌరస్తాలో ఆదివారం క్షీరాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా గంగాధర మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్​ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. గంగాధరకు డిగ్రీ కాలేజీ, చొప్పదండి‌‌‌‌‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్​ ఎమ్మెల్యే కృషితోనే జరిగాయని, రానున్న రోజుల్లో చొప్పదండిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు.