యాత్రికురాలిగా పాకిస్తాన్వెళ్లిన మహిళ తిరిగి రాలేదు..ఏం జరిగింది?

యాత్రికురాలిగా పాకిస్తాన్వెళ్లిన మహిళ తిరిగి రాలేదు..ఏం జరిగింది?

భారత్​ నుంచి పాకిస్తాన్​ కు వెళ్లిన సిక్కు మహిళ కనిపించకుండా పోయింది.. ప్రకాష్​ పర్వ గురు నానక్​దేవ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు పంజాబ్​నుంచి  వందలాది మంది పాకిస్తాన్​ లోని లాహోర్​ వెళ్లగా.. అందరూ తిరిగి వచ్చారుకు కానీ ఓ మహిళ మాత్రం రాలేదు.. ఆ మహిళ ఏమైంది.. ఎందుకు అక్కడ ఉండిపోయింది? 

 పంజాబ్​ కపుర్తలకు చెందిన 52 ఏళ్ల  సిక్కు మహిళ సరబ్​ జిత్​ కౌర్.. ప్రకాష్​ పర్వ గురు నానక్​ దేవ్​ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు ఇతర సిక్కులతో కలిసి నవంబర్​ 4న పాకిస్తాన్​ లోని లాహోర్​ వెళ్లింది. మతపరమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు రెండు దేశాలమధ్య ఒప్పందంలో భాగంగా వీరంతా అక్కడకు వెళ్లారు. ఈ ఏడాది ప్రకాష్​ పర్వ గురునానక్​ దేవ్​ 555 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2వేల మంది సిక్కులు పాకిస్తాన్​ వెళ్లారు. దాదాపు పది రోజులు పాకిస్తాన్​ లో గడిపిన తర్వాత తిరిగి నవంబర్​ 13న అందరూ భారత్​ కు వచ్చారు. ఒక్క సరబ్​ జిత్​ కౌర్​ తప్ప. 

అయితే సరబ్​జిత్ కౌర్​మిస్సింగ్​పై వెలుగులోకి వచ్చిన ఓ డాక్యుమెంట్​సంచలనం రేపుతోంది..అందులో  సరబ్​ జిత్​ కౌర మిస్సింగ్​ వెనక అసలు రహస్యాన్ని బయటపెట్టింది.. ఆమె పాకిస్తాన్​లో తప్పిపోయి అక్కడి వ్యక్తినే వివాహం చేసుకున్నట్లు  నిఖానామా డాక్యుమెంట్ చెబుతోంది. 

ఏంజరిగింది?

తప్పిపోయిన సిక్కు మహిళ సరబ్ జిత్ కౌర్​ మతం మార్చుకొని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్​ వ్యక్తిని పెళ్లి చేసుకుందని రుజువు చేసే ఉర్దూ లో ఉన్న నిఖానామా డాక్యుమెంట్ బయటపడింది. లాహోర్​ కు 56 కిలోమీటర్లు దూరంలో ఉన్న షేక్​ పురా నివాసి నాసిర్​ హుస్సేన్​ ను కౌర్​ వివాహం చేసుకున్నట్లు ఇందులో రాసి ఉంది.   

సరబ్ జిత్ కౌర్​ కు ఇంతకు ముందే పెళ్లైంది.. ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులైంది. ఆమె మాజీ భర్త కర్నైల్​ సింగ్​ ముప్పై ఏళ్లుగా ఇంగ్లండ్​ లో ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. మిగతా సిక్కులు ఇచ్చిన సమాచారంతో పాకిస్తాన్​ లోని పోలీసులు ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించారు. ఆమె అదృశ్యంపై భారత మిషన్ పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ (SGPC)  ప్రతియేటా పాకిస్తాన్​ లోని చారిత్రక గురుద్వారాలకు ముఖ్యంగా ప్రకాష్​ పర్వ్​కు నివాళులర్పించేందుకు సిక్కులను పంపిస్తుంది. అక్టోబర్​లో భద్రతా కారణాల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. అయితే రెండు వారాల తర్వాత సరిహద్దు అవతల ఉన్న నాన్‌కానా సాహిబ్ మందిరానికి 10 రోజుల యాత్ర కు వెళ్లేందుకు ప్రభుత్వం సిక్కు భక్తులను అనుమతించింది. సరబ్​ జిత్​ కౌర్ కు పాస్‌పోర్ట్ పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జారీ చేశారు. ఆమె పాకిస్తాన్‌లో అదృశ్యమైందని తిరిగి ఇండియాకు రాలేదు.