
అంతర్జాతీయ స్పీడ్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ ప్లేయర్లు ముగ్గురికి చోటు దక్కింది. బోరబండ బాలుర గురుకుల స్కూల్ కు చెందిన రఘు, మెషక్, కరుణాకర్ ఆయా విభాగాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అండర్-14 జట్టుకు ఎంపికైన రఘు…కెప్టెన్గా కూడా వ్యవహరించనున్నాడు. భారత్ అండర్-19 బాలుర జట్టుకు మెషక్, అండర్-17 బాలుర జట్టులో కరుణాకర్ చోటు దక్కించుకున్నారు. నేపాల్లోని మహేందర్నగర్లో ఈనెల 25, 26 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్బాల్ చాంపియన్షిప్ జరగనుంది. ముగ్గురు ప్లేయర్లు జాతీయ జట్టుకు ఎంపికవడంపై సంతోషంగా ఉందన్నారు ఆ స్కూలు PET నాసన్.