మనవాళ్లును పొగిడిన చైనా ఎక్స్‌పర్ట్‌

మనవాళ్లును పొగిడిన చైనా ఎక్స్‌పర్ట్‌
  • మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌ అని కితాబు
  • చైనా స్టూడెంట్స్‌తో చెప్పిన ఝాంగ్‌

బీజింగ్‌: ఇండియాలోని జనాలు ఫిజికల్‌గా ఇమ్యూన్‌ కాదని, వాళ్లంతా మెంటల్‌గా ఇమ్యూన్‌ అని చైనా షాంఘైలోని హొయ్‌శాన్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌‌ ఝాంగ్‌ అన్నారు. చైనాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా కాలంలో ఆయన కరోనా ఎక్స్‌పర్ట్‌గా పనిచేశారు. ఇండియన్స్‌ మెంటల్‌గా ఇమ్యూన్‌గా ఉన్నారు కాబట్టి కరోనా వ్యాప్తి చెందలేకపోతుందని ఇక్కడి చైనా స్టూడెంట్స్‌తో ఆయన అన్నారు. “ ఇండియన్స్‌కు చాలా పీస్‌ఫుల్‌ మైండ్‌ ఉంటుంది. ఒక గుడిలో జరిగిన కార్యక్రమంలో కొంత మంది మాస్కులు లేకుండా పాల్గొన్నారు. వాళ్లంతా ఫిజికల్‌గా కాదు.. మెంటల్‌గా ఇమ్యూనిటీ కలిగిని వారు. ఇండియాలో రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూఎస్‌ కంటే చాలా తక్కువ. కోట్ల మంది ప్రజలు ఉన్న ఇండియాలో కొంత మందే వ్యాధి బారిన పడుతున్నారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే వైరస్‌ పోకుతుంది. మీ చుట్టూ ఉన్న 90 శాతం మంది పరిశుభ్రంగానే ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు” అని ఝాంగ్‌ స్టూడెంట్స్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఇండియాలో ఇప్పటి వరకు 23వేల మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. 718 మంది చనిపోయారని హెల్త్‌ మినిస్ట్రీ చెప్పింది.