
ఉ. 11.30 నుంచి సోనీ నెట్వర్క్లో
మిర్పూర్: బంగ్లాదేశ్ టూర్లో అంచనాలతో బరిలోకి దిగి తొలి వన్డేలో బోల్తా కొట్టిన ఇండియా టీమ్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం బంగ్లాతో జరిగే ఈ మ్యాచ్లో స్టార్లతో కూడిన బ్యాటింగ్ లైనప్కు మరో పరీక్ష ఎదురుకానుంది. తొలి వన్డేలో బంగ్లా ఆఖరి వికెట్ తీయలేకపోయిన టీమిండియా బౌలర్లకు కూడా ఈ మ్యాచ్ సవాల్గా మారనుంది. 2015లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా 1–2తో బంగ్లా చేతిలో సిరీస్ను కోల్పోయింది.
ఈసారి కూడా అదే ఫలితం రిపీట్కావొద్దంటే ఈ పోరులో రోహిత్సేన గెలిచి తీరాల్సిందే. తొలి పోరులో ఫెయిలైన కెప్టెన్ రోహిత్, ధవన్, కోహ్లీ, శ్రేయస్ బ్యాట్ ఝుళిపించాలి. కేఎల్ రాహుల్ ఫామ్ కొనసాగిస్తే మంచిది. మరోవైపు తొలి మ్యాచ్ నెగ్గి 1–0తో లీడ్లో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్తోనే సిరీస్ నెగ్గాలని ఆశిస్తోంది.