నేడు బంగ్లా​తో ఇండియా రెండో వన్డే

నేడు బంగ్లా​తో ఇండియా రెండో వన్డే

ఉ. 11.30 నుంచి సోనీ నెట్​వర్క్​లో 

మిర్పూర్​: బంగ్లాదేశ్​ టూర్​లో అంచనాలతో బరిలోకి దిగి తొలి వన్డేలో బోల్తా కొట్టిన ఇండియా టీమ్​ రెండో మ్యాచ్​కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్​లో భాగంగా బుధవారం బంగ్లా​తో జరిగే ఈ మ్యాచ్​లో స్టార్లతో కూడిన బ్యాటింగ్​ లైనప్​కు మరో పరీక్ష ఎదురుకానుంది. తొలి వన్డేలో బంగ్లా ఆఖరి వికెట్​ తీయలేకపోయిన టీమిండియా బౌలర్లకు కూడా ఈ మ్యాచ్​ సవాల్​గా మారనుంది. 2015లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా 1–2తో బంగ్లా చేతిలో సిరీస్​ను కోల్పోయింది. 

ఈసారి కూడా అదే ఫలితం రిపీట్​కావొద్దంటే ఈ పోరులో రోహిత్​సేన గెలిచి తీరాల్సిందే. తొలి పోరులో ఫెయిలైన  కెప్టెన్​ రోహిత్​, ధవన్​, కోహ్లీ, శ్రేయస్​ బ్యాట్​ ఝుళిపించాలి. కేఎల్​ రాహుల్​ ఫామ్​ కొనసాగిస్తే మంచిది.  మరోవైపు తొలి మ్యాచ్​ నెగ్గి 1–0తో లీడ్​లో ఉన్న బంగ్లాదేశ్​ ఈ  మ్యాచ్​తోనే సిరీస్​ నెగ్గాలని ఆశిస్తోంది.