
ఉ.9గంటల నుండి సోనీ నెట్ వర్క్ లో లైవ్
కేఎల్ రాహుల్ చేతికి గాయం
మీర్పూర్: బంగ్లాదేశ్ టూర్లో వన్డే సిరీస్లో అనూహ్య ఓటమి తర్వాత టీమిండియా బలంగానే పుంజుకుంది. తొలి టెస్టులో బంగ్లాను చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. మొదటి రోజు ఇబ్బంది పడ్డా తర్వాతి నాలుగు రోజులూ బ్యాట్, బాల్తో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన టీమిండియా ఘన విజయం అందుకుంది. ఇప్పుడు అదే జోరును గురువారం మొదలయ్యే రెండో టెస్టులోనూ కొనసాగించాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ బుమ్రా, ఆల్రౌండర్ జడేజా లేకపోయినా తొలి పోరులో అద్భుతంగా ఆడిన జట్టు.. రెండో మ్యాచ్లోనూ గెలిచి 2–0తో సిరీస్ను స్వీప్ చేయడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో కీలక పాయింట్లు సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. మొదటి టెస్టు విక్టరీతో డబ్ల్యూటీసీ టేబుల్లో ఇండియా 55.77 పీసీటీతో నాలుగు నుంచి రెండో ప్లేస్కు దూసుకురావడంతో టాప్–2 రేసు మరింత రసవత్తరంగా మారింది. టాపర్ ఆస్ట్రేలియా (76.92 పీసీటీ) చేతిలో తమ మొదటి టెస్టులో ఘోర ఓటమితో సౌతాఫ్రికా (54.55 పీసీటీ) మూడో ప్లేస్కు పడిపోయింది.
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ రిజల్ట్తో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకునేది లేనిది తెలుస్తుంది. అప్పటిలోపు తాజా టెస్టులో గెలిచి రెండో ప్లేస్ను కాపాడుకోవాలన్న టార్గెట్తో ఇండియా బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్కూ దూరంగా ఉంటున్నాడు.
అయితే, ప్రాక్టీస్ సెషన్లో స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతికి దెబ్బ తగలడం ఆందోళన కలిగిస్తోంది. కానీ, మ్యాచ్ టైమ్కు అతను కోలుకొని అందుబాటులో ఉంటాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ తను దూరం అయితే ఓపెనింగ్ స్లాట్లో మార్పులతో పాటు కెప్టెన్ కూడా మారాల్సి ఉంటుంది. గాయం పెద్దదై తప్పుకుంటే.. అతని ప్లేస్లో అభిమన్యు ఈశ్వరన్.. శుభ్మన్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు.