హుస్సామ్‌ గోల్డెన్‌ పంచ్‌

హుస్సామ్‌ గోల్డెన్‌ పంచ్‌

హిసార్‌‌‌‌ : ఇండియా స్టార్‌‌ బాక్సర్‌‌, తెలంగాణ బిడ్డ మహ్మద్‌‌ హుస్సాముద్దీన్‌‌ మరోసారి తన పంచ్‌‌ పవర్​ చూపెట్టాడు. నేషనల్‌‌ మెన్స్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో గోల్డెన్‌‌ పంచ్‌‌ విసిరాడు. మెగా టోర్నీ 57 కేజీ కేటగిరీలో నేషనల్‌‌ చాంపియన్‌‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో హుస్సామ్‌‌ (సర్వీసెస్‌‌) 4–1తో 2016 వరల్డ్‌‌ యూత్‌‌ చాంపియన్‌‌ సచిన్‌‌ (రైల్వేస్‌‌)పై గెలిచాడు. గతేడాది సిల్వర్‌‌తో సరిపెట్టిన హుస్సామ్‌‌ ఈ సారి గోల్డ్‌‌పై గురి పెట్టి అనుకున్నది సాధించాడు.  అన్ని ఫైనల్స్‌‌లో హుస్సామ్‌‌ బౌట్‌‌ హైలైట్‌‌గా నిలిచింది. పోటాపోటీగా జరిగిన పోరులో తను తొలి రౌండ్‌‌ నుంచే అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేశాడు. తన ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఉపయోగించిన తెలంగాణ స్టార్‌‌.. పవర్‌‌ ఫుల్‌‌ పంచ్‌‌లతో సచిన్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేసి విజేతగా నిలిచాడు.

అస్సాం స్టార్‌‌ శివ థాపా కూడా గోల్డ్‌‌ నెగ్గాడు. 63.5 కేజీ ఫైనల్లో థాపా 5–0తో అంకిత్‌‌ నర్వాల్‌‌ (రైల్వేస్‌‌)ను చిత్తు చేశాడు. సర్వీసెస్‌‌ బాక్సర్లు బిశ్వామిత్ర చోంగ్‌‌తమ్ (51 కేజీ), సచిన్‌‌ (54 కేజీ), ఆకాశ్‌‌ (67 కేజీ), సుమిత్‌‌ (75) కేజీ)తో పాటు లోకల్‌‌ బాక్సర్లు  అభిమన్యు లౌరా (80 కేజీ), నవీన్‌‌ కుమార్‌‌ (92కేజీ) తమ బౌట్లలో గెలిచి గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించారు. ప్రత్యర్థి వాకోవర్‌‌ ఇవ్వడంతో నరేందర్‌‌ (+92 కేజీ) టైటిల్‌‌ నెగ్గాడు. ఓవరాల్‌‌గా ఆరు గోల్డ్‌‌, ఓ సిల్వర్‌‌, మూడు బ్రాంజ్‌‌ గెలిచిన సర్వీసెస్‌‌ టీమ్‌‌ మరోసారి టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సొంతం చేసుకుంది.