రిథమ్‌‌ సంగ్వాన్‌‌కు పారిస్‌‌ బెర్త్‌‌

రిథమ్‌‌ సంగ్వాన్‌‌కు పారిస్‌‌ బెర్త్‌‌

జకర్తా : ఇండియా స్టార్‌‌ షూటర్‌‌ రిథమ్‌‌ సంగ్వాన్‌‌.. పారిస్‌‌ ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించింది. ఆసియా ఒలింపిక్‌‌ క్వాలిఫయర్స్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ సాధించడంతో మెగా ఈవెంట్‌‌ బెర్త్‌‌ కన్ఫామ్‌‌ అయ్యింది. గురువారం జరిగిన విమెన్స్‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌ ఫైనల్లో రిథమ్‌‌ 28 పాయింట్లతో థర్డ్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. ప్రస్తుత టోర్నీలో రిథమ్‌‌కు ఇది మూడో మెడల్‌‌. కొరియన్‌‌ షూటర్లు యాంగ్‌‌ జిన్‌‌ (41), కిమ్‌‌ యిజి (32) వరుసగా గోల్డ్‌‌

సిల్వర్‌‌ మెడల్స్‌‌ను నెగ్గారు. ఓవరాల్‌‌గా షూటింగ్‌‌లో ఇండియాకు ఇది 16వ ఒలింపిక్‌‌ బెర్త్‌‌ కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌‌లో ఇండియా నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. మొత్తానికి జకర్తా టోర్నీ ముగ్గురు ఇండియన్‌‌ షూటర్ల (ఇషా సింగ్‌‌, వరుణ్‌‌ తొమర్‌‌, రిథమ్‌‌)కు ఒలింపిక్స్‌‌ బెర్త్‌‌లను సాధించిపెట్టింది.