క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు

సిడ్నీ: ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌. ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. జపాన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సింధు 21–14, 21–10తో ఇండియాకే చెందిన ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌పై నెగ్గింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 21–10, 21–17తో సు లీ యంగ్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ), ప్రణయ్‌‌‌‌‌‌‌‌ 19–21, 21–19, 21–13తో చి యు జెన్‌‌‌‌‌‌‌‌ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ), ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌ 21–8, 13–21, 21–19తో వాంగ్‌‌‌‌‌‌‌‌ జు వీ (చైనీస్‌‌‌‌‌‌‌‌తైపీ)పై గెలిచారు.

మిథున్‌‌‌‌‌‌‌‌ మంజునాథ్‌‌‌‌‌‌‌‌ 13–21, 21–12, 19–21తో లీ జి జియా (మలేసియా)  చేతిలో పోరాడి ఓడాడు. కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 15–21, 18–21తో అంథోనీ సిన్సుకా గింటింగ్‌‌‌‌‌‌‌‌ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో గాయత్రి గోపీచంద్‌‌‌‌‌‌‌‌–ట్రిసా జోలీ 10–21, 20–22తో మయు ముట్సుమోటో–వాకనా నగహర (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో పరాజయం పాలయ్యారు.