దక్షిణాఫ్రికాలో మొదటి సారిగా బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 60 దేశాలకు పాకింది. భారత్ లోనూ ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లేటెస్టుగా దేశ రాజధాని ఢిల్లీలో 4, రాజస్థాన్ లో 4, మహారాష్ట్రలో 8 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క మహారాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. ఇప్పటి వరకు మొత్తంగా భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి పెరిగింది.
ఢిల్లీలో ఇప్పటి వరకు 6 ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. అయితే వారిలో ఒకరు కోలుకుని డిశ్చార్జి అయ్యారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మిగిలిన ఐదుగురికి చికిత్స జరుగుతోందన్నారు. రాజస్థాన్ లో కొత్తగా సోకిన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్సాడీ లాల్ మీనా చెప్పారు