
ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో సమస్య
ముంబై ఏటీఎస్కు పైలెట్ల ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ మెసేజ్
క్లియరెన్స్ రాగానే సేఫ్ ల్యాండింగ్
ముంబై: ఢిల్లీ నుంచి గోవా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. గాల్లో ఉన్నప్పుడే ఒక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలెట్లు వెంటనే ముంబై ఏటీఎస్కు ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ అని మెసేజ్ పంపారు. అక్కడి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయింది అని ఇండిగో సిబ్బంది తెలిపారు.
ఎయిర్బస్ ఏ320 నియో (6ఈ–6271) విమానం సుమారు 191 మందితో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బుధవారం రాత్రి బయల్దేరింది. భువనేశ్వర్కు 180 కిలో మీటర్ల దూరంలో ఆకాశంలో ఉన్నప్పుడు ఒక ఇంజన్ పని చేయకపోవడాన్ని పైలెట్లు గుర్తించారు. వెంటనే ప్రయాణికులకు సమాచారం ఇచ్చి ఫ్లైట్ను ముంబైకు దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు.
ముంబై ఏటీఎస్కు ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్..’ అని సమాచారం పంపారు. వాళ్ల దగ్గరి నుంచి పర్మిషన్ రాగానే.. రాత్రి 9.52కు సేఫ్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని ఇండిగో ప్రతినిధి వివరించారు. టెక్నికల్ టీమ్ ఫ్లైట్ను పరిశీలించింది. ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటు చేసి గోవాకు తరలించామని తెలిపారు.
ప్యాన్.. ప్యాన్.. ప్యాన్ అంటే ఏంటి?
‘మేడే.. మేడే.. మేడే..’ అని కాక్పిట్ నుంచి ఏటీఎస్కు సమాచారం వెళ్లిందంటే ఫ్లైట్ ప్రమాదంలో ఉందని అర్థం. ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ అనేది విమానంలో ఎమర్జెన్సీని సూచించే రేడియో డిస్ట్రెస్ కాల్. ఆకాశంలో ఉన్నప్పుడు ఇంజన్లో సమస్య తలెత్తితే.. పైలట్ ఈ మెసేజ్ను పంపిస్తారు. ప్యాన్ అనేది ఫ్రెంచ్ పదం. ‘బ్రేక్ డౌన్’ అని దీని అర్థం. రెండు ఇంజన్లలో ఒక ఇంజన్ ఫెయిల్ అయి.. మరొకటి పని చేస్తున్నప్పుడు ఈ సందేశం పంపిస్తారు.
ఇండిగో ఫ్లైట్లో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: ఇంఫాల్ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయిన మరో ఇండిగో ఫ్లైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. మైనర్ టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఫ్లైట్ను రిటర్న్ ఢిల్లీలో ల్యాండ్ చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. 6ఈ–5118 ఇండిగో ఫ్లైట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఉదయం 10:45కు ఇంఫాల్కు టేకాఫ్ అయింది.
కొద్దిసేపటికి ఇంజిన్లో సమస్య తలెత్తడంతో అధికారులకు. చెప్పగా, వారు ఫ్లైట్ను రిటర్న్ తీసుకురావాలని పైలెట్లకు సూచించారు. సుమారు గంట పాటు గాల్లోనే ఉన్న విమానం.. 11:50కు ఢిల్లీలో సేఫ్ ల్యాండ్ అయింది. విమానంలో 185 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.