
జిన్నారం, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ఆవరణలో నిర్మించిన మోడల్ హౌస్ ను మంగళవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతింటిని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగాలబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. నూతన టెక్నాలజీతో అత్యంత తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో ఇంటిని నిర్మించిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీడీవో అరుణ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జనబాయి, సీనియర్ నాయకులు రాజు గౌడ్, నారా బోయిన శ్రీనివాస్, రవి, రఘు, పూజారి కృష్ణ, మహేందర్ రెడ్డి,మధు, వంశీ పాల్గొన్నారు.