
హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డాక్టర్ జి. మల్సూర్ శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన వెటర్నరీ సైన్స్ మాస్టర్స్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్ డిప్లొమా హోల్డర్, 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్- 1 అధికారిగా చేరి, తెలంగాణలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ చేశారు. కోఆపరేటివ్, సామాజిక సంక్షేమం, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో పనిచేశారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో సీఈఓ, జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖ, ఎంసీహెచ్లో విధులు నిర్వహించారు. నీటిపారుదల శాఖలో వరల్డ్ బ్యాంక్, జైకా ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కాడా కమిషనర్గా, టీఎస్ఎండీసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా సేవలందించారు.