INDvs NZ T20: లాస్ట్ ఓవర్లో విధ్వంసం..కివీస్ భారీ స్కోర్

INDvs NZ T20: లాస్ట్ ఓవర్లో విధ్వంసం..కివీస్ భారీ స్కోర్

భారత్ తో జరుగుతోన్న తొలి టీ20 లో  న్యూజిలాండ్  భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత్ కు 177 పరుగుల టార్గెట్ li  నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. దూకుడుగా ఆడి జట్టు  స్కోర్ బోర్డ్ పెంచారు. ఫిన్ అలెన్ 35, డేవన్ కాన్వే 52 పరుగులతో రాణించారు. తర్వాత వచ్చిన డార్లిల్ మిచెల్ 59 పరుగులతో చెలరేగడంతో కివీస్ 176 పరుగులు చేసింది.  లాస్ట్ ఓవర్లోనే 27 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్2,  అర్ష్ దీప్, కుల్దీప్, శివమ్ దూబే తలో ఒక్క వికెట్ తీశారు.