ఓల్డ్ సిటీ నేపథ్యంలో లింగోచ్చా మూవీ

ఓల్డ్ సిటీ నేపథ్యంలో లింగోచ్చా మూవీ

కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడాని దర్శకత్వంలో యాదగిరి రాజు నిర్మించిన చిత్రం ‘లింగోచ్చా’. ‘ఫిదా నీపై ఫిదా’ అనే పాటను బుధవారం లాంచ్ చేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన హీరో సోహైల్ మాట్లాడుతూ ‘ఓల్డ్ సిటీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తోన్న ఈ చిత్రం చాలా నేచురల్‌‌గా ఉంది. ఈ పాట పాడిన కరీముల్లా వాయిస్ నాకు చాలా ఇష్టం. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు.

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘ఆనంద్ కొత్త దర్శకుడైనా ఎక్స్‌‌పీరియన్స్‌‌ ఉన్న డైరెక్టర్‌‌‌‌లా తీశాడు. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తీశారు. కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు . కొత్త కార్తీక్ రత్నాన్ని ఇందులో చూడబోతున్నారని చెప్పాడు దర్శకుడు. అక్టోబర్ 27న సినిమాని విడుదల చేస్తామన్నారు నిర్మాత. నటులు తాగుబోతు రమేష్, సద్దామ్, యాదమ్మరాజు, బల్వీర్ సింగ్, సింగర్ కరీముల్లాతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.