హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ట భూమిపూజ

హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ట భూమిపూజ

పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట డివిజన్ హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్ట ప్రారంభ పూజలు ఆదివారం ఘనంగా జరిగాయి.  ఈ పూజల్లో  సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్​ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ బీఆర్ఎస్​ ఇంచార్జి  గుర్రం పవన్ కుమార్ గౌడ్‌లతో  కలిసి పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  

ఈ నెల 25వ తేదీన రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్​సమక్షంలో  బొడ్రాయిని ప్రతిష్టించనున్నట్లు బస్తీ వాసులు తెలిపారు.  బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్​ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టకు సంసిద్ధత వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో బన్సీలాల్‌పేట డివిజన్ బీఆర్‌‌ఎస్​ అధ్యక్షుడు ఎల్. వెంకటేశన్ రాజు, బస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.