రైస్ గోదాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు

రైస్ గోదాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు

రంగారెడ్డి జిల్లా  బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ కిస్మాత్ పూర్ లో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిస్మత్ పూర్ లోని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల గిడ్డంగిలో ఈ తనిఖీలు చేపట్టారు. రైస్ గోదాంలో ఉన్న స్టాక్ ను‌‌‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం క్షుణ్ణంగా చెక్  చేసింది. 

గోదాంలలో ఉన్న స్టాక్ రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాహసీల్దారు రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.