శ్రీవారి మెట్లు ఎక్కుతూ.. గుండెపోటుతో డీఎస్పీ పోలీస్ మృతి

శ్రీవారి మెట్లు ఎక్కుతూ.. గుండెపోటుతో డీఎస్పీ పోలీస్ మృతి

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో గుండెపోటుతో డీఎస్పీ మృతి చెందారు. ఈరోజు(నవంబర్ 25) ఉదయం 1, 805 మెట్టు దగ్గర ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(59) కుప్పకూలారు. దీంతో  డీఎస్పీని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.  

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం.. కృపాకర్ తిరుమలకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కృపాకర్‌ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి కాగా.. ఘటనపై కృపాకర్‌ కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు.