ఇంటర్ బోర్డు: ఆన్సర్ షీట్లలో పేపర్లు గాయబ్

ఇంటర్ బోర్డు: ఆన్సర్ షీట్లలో పేపర్లు గాయబ్

.. హైదరాబాద్​కు చెందిన ఇంటర్​ స్టూడెంట్​ ఒకరు రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​లోనూ ఫిజిక్స్‌‌‌‌లో ఫెయిలైంది. ఆమె ఆన్సర్‌‌‌‌ షీట్లను చూసుకునే సరికి దాంట్లో కొన్ని పేజీలు మిస్సయ్యాయి. దీంతో ఆ స్టూడెంట్స్​ పేరెంట్స్‌‌‌‌ ఇంటర్‌‌‌‌ బోర్డుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చూసినా ఆన్సర్‌‌‌‌ షీట్లో 7వ పేజీ, 8వ పేజీ కనిపించలేదు.

..హైదరాబాద్‌‌‌‌కు చెందిన మరో స్టూడెంట్​ మ్యాథ్స్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ అయ్యాడు. వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అతడి ఆన్సర్‌‌‌‌షీట్లను డౌన్​లోడ్‌‌‌‌ చేసుకుని చూస్తే, ఓఎమ్మార్​ పార్ట్‌‌‌‌ 1 వేరే అమ్మాయి పేరుతో వచ్చింది. దీంతో అతడు ఇంటర్‌‌‌‌బోర్డుకు వచ్చి ఫిర్యాదు చేశాడు. మిగిలిన జవాబుపత్రం కూడా సరిగా దిద్దలేదని ఆ స్టూడెంట్​ బోర్డు అధికారుల ముందు వాపోయాడు.

ఇలా ఒకటీ రెండు సంఘటనలే కాదు.. ఇంకా ఎన్నో ఇంటర్‌‌‌‌ బోర్డు తప్పిదాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఏప్రిల్​లో విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో ఫెయిల్‌‌‌‌ అయ్యాననే బాధతో ఆత్మహత్య చేసుకున్న అనామిక ఇష్యూ కూడా తాజాగా బయటికొచ్చింది. ఫెయిలైన స్టూడెంట్స్‌‌‌‌కు సంబంధించి రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​ రిజల్ట్స్​లో అనామిక మార్కులను వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టకుండా, ఐదు రోజుల తర్వాత అప్లోడ్‌‌‌‌ చేశారు. దాంట్లో అనామిక 48 మార్కులతో తెలుగు సబ్జెక్టులో పాసైనట్టు పేర్కొన్నారు. దీనిపై ఆదివారం మీడియాలో కథనాలు రావడంతో అదే రాత్రి మళ్లీ ఆ మార్కులు తప్పని, అనామికకు వచ్చింది 21 మార్కులేనని ఇంటర్‌‌‌‌ బోర్డు చెప్పుకొచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఫెయిలైన స్టూడెంట్స్‌‌‌‌ రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​ రిజల్ట్స్‌‌‌‌ను విడుదల చేసినా ఇంకా గందరగోళంగానే కొనసాగుతూ ఉంది. వేలాది మంది స్టూడెంట్స్​ ఆన్సర్‌‌‌‌షీట్లు, రిజల్ట్స్‌‌‌‌ను అధికారులు సకాలంలో వెబ్‌‌‌‌సైట్​లో  పొందుపర్చలేదు. ఇక, పాసైన స్టూడెంట్స్‌‌‌‌కు సంబంధించి శుక్రవారం విడుదల చేసిన రీ కౌంటింగ్​, రీ వెరిఫికేషన్​ఫలితాల ఆన్సర్‌‌‌‌షీట్లను ఆదివారం రాత్రి వరకూ అప్​లోడ్​ చేశారు. అధికారికంగానే 8 వేల ఆన్సర్‌‌‌‌ షీట్లను అప్​లోడ్​ చేయాల్సి ఉందని వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టారు. ఏప్రిల్​లో విడుదల చేసిన ఇంటర్‌‌‌‌ ఫలితాల్లో 3, 82, 116 మంది స్టూడెంట్స్​ ఫెయిలైనట్లు బోర్డు పేర్కొన్న విషయం తెలిసిందే. నాటి ఫలితాల్లో తీవ్ర తప్పులు దొర్లినట్లు ఆరోపణలు రావడం, ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ ఫెయిలైన పిల్లలందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​ ఏర్పాటు చేసింది. ఈ 3,82,116 మంది స్టూడెంట్స్​కు సంబంధించి  9,02,429 ఆన్సర్​ షీట్లు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టామని, మరో 19,788 జవాబు పత్రాల స్కానింగ్‌‌‌‌ను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని మే 27న ఇంటర్​ బోర్డు అధికారులు వెల్లడించారు. కానీ వాటిని వెబ్​సైట్​లో పెట్టడానికి ఆరు రోజుల సమయం తీసుకున్నారు. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన స్టూడెంట్స్‌‌‌‌ రీ వెరిఫికేషన్‌‌‌‌ కోసం దరఖాస్తు చేస్తే, వారిలో చాలా మందివి ఒకటీ, రెండు సబ్జెక్టుల వివరాలు మాత్రమే వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో కనిపించాయి.