నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీలో 57 శాతం ఉత్తీర్ణత

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీలో 57 శాతం ఉత్తీర్ణత

నిజామాబాద్​, వెలుగు: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.  ఫస్ట్​ ఇయర్ పరీక్ష 10,098 మంది రాయగా, 5,851 మంది పాసయ్యారు. సెకండ్​ ఇయర్ పరీక్ష 6,497 రాయగా, 3,733 మంది ఉత్తీర్ణులయ్యారు. 57.46 ఉత్తీర్ణత శాతం నమోదైంది.  ఫస్ట్​ ఇయర్​ ఓకేషనల్​లో 1,420 మంది స్టూడెంట్స్​కు 903, సెకండ్ ఇయర్ ఓకేషనల్ పరీక్ష రాసిన 899 మంది విద్యార్థుల్లో 503 పాసయ్యారు. రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ కావాలనుకునే స్టూడెంట్స్ ఈ నెల 17 నుంచి 23 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేయాలని డీవీఈవో రవికుమార్తెలిపారు.

కామారెడ్డిలో 56.68 శాతం ఉత్తీర్ణత..           

కామారెడ్డి, వెలుగు : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో విద్యార్థులు 56.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.  సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 3,453  మంది పరీక్ష రాయగా, 1,957 మంది పాసయ్యారు.  ఫస్ట్ ఇయర్ లో  4363  మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2441 మంది ( 55.95 శాతం) పాసయ్యారు.