కొడుకును కొడుతుంటే తండ్రి ప్రభాస్ ఎంట్రీ.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్

కొడుకును కొడుతుంటే తండ్రి ప్రభాస్ ఎంట్రీ.. నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

ఇక తాజాగా సలార్ నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఇంటెర్వేల్ బ్లాక్ ఎక్స్ట్రార్డినరీ లెవల్లో ప్లాన్ చేశాడట ప్రశాంత్. దాదాపు 2000 మందితో ఉండనున్న ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలువనుందని టాక్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ యాక్షన్ సీన్ లో ప్రభాస్ 2000 మందితో ఫైట్ చేస్తుంటే.. అతని కాపాడటానికి తండ్రి ప్రభాస్ ఎంట్రీ ఇస్తారట. తన కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తున్న వారిని వీరలెవల్లో ఇరగొట్టేస్తాడట ప్రభాస్. ఈ ఎపిసోడ్ అంతా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోతోంది. ఆ సీన్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వినడానికే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్న ఈ సీక్వెన్స్ సినిమాల ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.

ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. శృతి హాసన్(Shruthu haasan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మళయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్(Prudhviraaj sukumaran) విలన్ గా చేస్తున్నారు. జగపతి బాబు(Jagapathi babu) మరో కీలక రోల్ కనిపించనున్న ఈ సినిమాకు రవి బాసృర్(Ravi basrur) సంగీతం అందిస్తుండగా.. హోంబలే ఫిలిమ్స్(Hombale Films) బ్యానర్ పై విజయ్ కిరగందూర్(Vijay kiragandur) నిర్మిస్తున్నారు.