ఖైరతాబాద్,వెలుగు : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ‘ భాషా పండితుల గీతం’ సీడీ ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి హాజరై సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. భాషా పండితుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిందన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి కాంతికృష్ణ, పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పార్వతి సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్,గేయ నిర్మాత వివేక్భవాని, ఎండీ అమీర్పాషా పాల్గొన్నారు.
