
హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ హైదరాబాద్లో కొత్త ఆఫీసును తెరిచింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు. సలపూరియా సత్వ నాలెడ్జ్సిటీలో ఇది 3.51 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో 2,500 మంది పనిచేస్తారు. ఇక్కడి నుంచే క్లయింట్లకు ఇంజనీరింగ్, గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది.