హైదరాబాద్, వెలుగు: నవంబర్ 25–28 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025కు రావాలని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్రెడ్డిని కోరింది. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ అని అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ చెప్పారు.
ఇందులో 1,500కి పైగా ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, ఉద్యోగావకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు.
