ఐఓఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో సింధు, గగన్‌‌‌‌కు ఓటు హక్కు

ఐఓఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో  సింధు, గగన్‌‌‌‌కు ఓటు హక్కు

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు, వెటరన్‌‌‌‌ షూటర్‌‌‌‌ గగన్‌‌‌‌ నారంగ్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ ఒలిపింక్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఐఓఏ) ఎలక్షన్స్‌‌‌‌లో ఓటు వేయనున్నారు.  ఒలింపిక్‌‌‌‌ మెడలిస్టులు సాక్షి మాలిక్‌‌‌‌, యోగేశ్వర్‌‌‌‌ దత్‌‌‌‌కు  కూడా ఓటు హక్కు లభించింది. డిసెంబర్‌‌‌‌ 10వ తేదీన జరిగే ఐఓఏ ఎలక్షన్స్‌‌‌‌ కోసం సోమవారం 77 మందితో  ఎలక్టోరల్‌‌‌‌ కాలేజీని ప్రకటించారు. 

ఇందులో మహిళలకు సమాన ఓటు హక్కులు కల్పించడం విశేషం. మొత్తం ఓటర్లలో 39 మంది మహిళలు కాగా, 38 మంది పురుషులు. 33 నేషనల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ ఫెడరేషన్ల నుంచి పురుషుడితో పాటు మహిళకు ప్రతినిధిగా అవకాశం కల్పించారు. అథ్లెట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌గా సింధు, గగన్‌‌‌‌, యోగేశ్వర్‌‌‌‌లకు ఓటు హక్కు ఇచ్చారు.