నవంబర్లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌పో నిర్వహించనున్న ఐపీఈఎంఏ

నవంబర్లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌పో  నిర్వహించనున్న ఐపీఈఎంఏ

హైదరాబాద్, వెలుగు: పౌల్ట్రీ పరిశ్రమ కోసం హైదరాబాద్​లో నవంబర్ లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌పో 17వ ఎడిష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ఇండియన్​ పౌల్ట్రీ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్​ మాన్యుఫ్యాక్చరర్స్​ అసోసియేషన్​ (ఐపీఈఎంఏ) ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోను నవంబర్ 25 నుంచి 28 వరకు దీనిని నిర్వహించనుంది.  

సస్టెయినబుల్​ ఫీడ్​, పౌల్ట్రీ ఆటోమేషన్​, పౌల్ట్రీ ఆరోగ్యం, పేడ నిర్వహణ, ఈ రంగంలో కెరీర్​ అవకాశాలు లాంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోలో 50కి పైగా దేశాల నుంచి 500కి పైగా కంపెనీలు పాల్గొంటాయి. సుమారు 50 వేల మంది సందర్శిస్తారని అంచనా. 

ఈ ఎడిష‌‌‌‌‌‌‌‌న్​లో బ్రీడింగ్​, హేచరీ ఆటోమేషన్​, ఫీడ్​ మిల్లింగ్​, వెటర్నరీ ఉత్పత్తులు, పౌల్ట్రీ హోమ్స్​ ప్రదర్శిస్తారు. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా హైదరాబాద్​లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐపీఈఎంఏ ఈ వివరాలను వెల్లడించింది.  మన దేశంలో ప్రోటీన్ లోపాన్ని అరికట్టాలంటే గుడ్ల వాడకం పెరగాలని స్పష్టం చేసింది.