ముంబైకి మళ్లీ పరీక్షే.. పంజాబ్ స్కోర్-198

ముంబైకి మళ్లీ పరీక్షే.. పంజాబ్ స్కోర్-198

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్‌ ధావన్‌ 70 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ 52 పరుగులు సాధించాడు. ఇక చివర్లో జితేశ్‌ శర్మ 14 బంతుల్లో 30 పరుగులతో మెరవడంతో పంజాబ్‌కు భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో బాసిల్‌ థంపి 2, బుమ్రా, ఉనాద్కట్‌, మురుగన్‌ అశ్విన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.