IPL : చెన్నైతో మ్యాచ్..హైదరాబాద్ ఫీల్డింగ్

IPL : చెన్నైతో మ్యాచ్..హైదరాబాద్ ఫీల్డింగ్

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచింది చెన్నై. కెప్టెన్ సురేష్ రైనా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  ధోనీకి ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించి.. అతని స్థానంలో సురేశ్ రైనాకు కెప్టెన్సీ అప్పగించింది CSK యాజమాన్య. ధోనీ స్థానంలో శామ్ బిల్లింగ్స్‌ని, మిషెల్ శాంట్నర్ స్థానంలో కర్న్ శర్మని టీమ్ లోకి తీసుకుంది.

సన్‌ రైజర్స్ రికీ భుయ్, అభిషేక్ శర్మల స్థానంలో యుసుఫ్ పఠాన్, షాబాజ్ నదీమ్‌ లను టీమ్ లోకి తీసుకుంది. జోరుమీదున్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ఉండాలని చూస్తుండగా..వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన సన్‌ రైజర్స్ ఈ మ్యాచ్‌ లో విజయం సాధించి.. పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.