క్రికెట్ పండుగ ఐపీఎల్ కు ఇంకా కొన్ని నెలలే టైం ఉంది. సీజన్ షూరూ కాగానే టీవీ, ఫోన్లకు అతుక్కుపోతుంటారు. ఇంట్లో టీవీ చూడలేక, డబ్బులు పెట్టి ఫోన్లో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివాళ్లకు రిలయెన్స్ జియో శుభవార్త చెప్పింది. 2023 ఐపీఎల్ సీజన్ మొత్తం తన సబ్ స్క్రైబర్స్ (జీయో సిమ్ యూజర్స్) ఫ్రీగా చూసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇదే జరిగితే రిలయెన్స్ జియో మరో సంచలం అవుతుంది.
2022 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసార డిజిటల్ రైట్స్ ని వయాకామ్ 18 రూ. 23,758 కోట్లకు దక్కించుకుంది. మ్యాచ్లన్నీ జియో సినిమాలో ప్రసారం అవుతాయి. అయితే, మ్యాచ్ చూసేందుకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ చేసే అవకాశాన్ని జియో సినిమా అందిస్తుంది. దీని ద్వారా సబ్ స్ర్కైబర్లను పెంచుకునే ప్లాన్ చేస్తోంది. అయితే, ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ ని జియో సినిమాలో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది.