
ఐపీఎలో సందడి మరో నెల రోజుల్లో మొదలు కాబోతోంది. ఎంతో మంది యువ ఆటగాళ్ల ఈ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు బాగా ఆడుతారా అని ఇప్పటి నుంచే అభిమానులు లెక్కలు వేసుకుంటారు. అయితే ఈ ఐపీఎల్ లో యువ ఆటగాళ్లలో ఎవరు బాగా ఆడుతారనే ప్రశ్నకు బీసీసీఐ బాస్ గంగూలీ ఓ ఐదుగురి పేర్లు చెప్పేశాడు. అందులో శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.
ఓ షోలో పాల్గొన్న గంగూలీ‘ ఈ సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ ను యువ ఆటగాడిగా పరిగణించలేం. యువ ప్లేయర్లలో శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీషా, రిషబ్ పంత్ లో ఎంతో ప్రతిభ ఉంది. వీరు ముగ్గురు బాగా ఆడతారనుకుంటున్నా. బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఫిట్ గా ఉంటే బాగా ఆడతాడు’ అని చెప్పాడు.